ED: అక్షయ గోల్డ్ కుంభకోణంపై ఈడీ ఛార్జిషీట్

ABN , First Publish Date - 2023-09-12T20:07:19+05:30 IST

అక్షయ గోల్డ్ కుంభకోణంపై (Akshaya Gold scam) ఈడీ (ED) ఛార్జిషీట్ దాఖలు చేసింది.

ED: అక్షయ గోల్డ్ కుంభకోణంపై ఈడీ ఛార్జిషీట్

విశాఖపట్నం: అక్షయ గోల్డ్ కుంభకోణంపై (Akshaya Gold scam) ఈడీ (ED) ఛార్జిషీట్ దాఖలు చేసింది. విశాఖపట్నం ఎంఎస్ జే కోర్టులో అక్షయగోల్డ్ పై ఛార్జిషీట్ వేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. అక్షయగోల్డ్ డైరెక్టర్లు భోగి సుబ్రహ్మణ్యం, దేవకి హరనాథ్ బాబు, ఎం.సుధాకర్ రావుపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది. అక్షయగోల్డ్ కేసులో ఈడీ చార్జిషీట్‌ను విశాఖ కోర్టు విచారణకు స్వీకరించింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో అక్షయగోల్డ్ పై కేసుల ఆధారంగా ఈడీ విచారణ చేపట్టింది. అక్షయగోల్డ్ కేసులో రూ.268.24కోట్ల విలువైన ఆస్తులు ఇప్పటికే అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది.

Updated Date - 2023-09-12T20:09:32+05:30 IST