ముఖ హాజరుతో మున్సిపల్‌ ఉద్యోగులకు ఇబ్బందులు

ABN , First Publish Date - 2023-01-18T01:40:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌తో మున్సిపల్‌ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానం సెప్టెంబర్‌లోనే ప్రవేశపెట్టినా కాకినాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు మాత్రం మంగళవారం నుంచి అమ లులోకి వచ్చింది.

ముఖ హాజరుతో మున్సిపల్‌ ఉద్యోగులకు ఇబ్బందులు

కార్పొరేషన్‌(కాకినాడ), జనవరి 17 : రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఫేస్‌ క్యాప్చరింగ్‌ అటెండెన్స్‌తో మున్సిపల్‌ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విధానం సెప్టెంబర్‌లోనే ప్రవేశపెట్టినా కాకినాడ నగరపాలక సంస్థ ఉద్యోగులకు మాత్రం మంగళవారం నుంచి అమ లులోకి వచ్చింది. కానీ సాంకేతిక సమస్యలతో ఉద్యోగులు తంటాలు పడ్డారు. యాప్‌ డౌన్‌ లోడ్‌తోపాటు ఫొటో అప్‌లోడ్‌ చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అటెండెన్స్‌ యాప్‌తో మొదటి రోజే తిప్పలు తప్పలేదు. నెట్‌ లేక కొందరు, స్మార్ట్‌ఫోన్‌లు లేక మరికొందరు ప్రయా సపడ్డారు. గతంలో ఉన్న బయోమెట్రిక్‌ విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఈ యాప్‌పై మండిపడుతున్నారు. మిగిలిన శాఖలకంటే కార్పొరేషన్‌ ఉద్యోగులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ కార్పొరేషన్‌ కార్యాలయ శాఖలను నాలుగుచోట్ల ఏర్పా టుచేయడంతో అందరూ ఒకేచోట ఉదయం, సాయంత్రం హాజరు వేయాలనే నిబంధన ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. శారదాంబ గుడి వద్ద ప్రధాన కార్యాలయానికి, మిగిలిన మూడు చోట్ల కార్యాలయాలకు రెండు కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు.

Updated Date - 2023-01-18T01:40:52+05:30 IST