Devineni Uma: జగన్‌ మూర్ఖత్వం, అహంకారం పోలవరానికి శాపంగా మారాయి

ABN , First Publish Date - 2023-07-05T19:35:15+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Reddy)పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు.

Devineni Uma: జగన్‌ మూర్ఖత్వం, అహంకారం పోలవరానికి శాపంగా మారాయి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Reddy)పై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Umamaheswara Rao) విమర్శలు గుప్పించారు. జగన్‌ మూర్ఖత్వం, అహంకారం పోలవరానికి శాపంగా మారాయని విమర్శించారు. పోలవరం నిలిచిపోవడానికి కారణం జగన్‌రెడ్డే కారణమని, కేంద్రమంత్రి షెకావత్ వ్యాఖ్యలపై జగన్‌ సమాధానం చెప్పాలని ఉమ డిమాండ్ చేశారు.

కమీషన్ల కక్కుర్తితో రివర్స్ టెండరింగ్ డ్రామాలాడారని, తండ్రి విగ్రహం పెట్టడానికి రూ.350 కోట్లు కేటాయించిన జగన్‌.. నిర్వాసితులకు 4ఏళ్లలో రూ.3 కోట్లు కూడా కేటాయించలేదని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లను జగన్‌ నిర్వీర్యం చేశారని దేవినేని ఉమా మండిపడ్డారు.

Updated Date - 2023-07-05T19:36:08+05:30 IST