Share News

Ramakrishna: ఆదానీ కంపెనీకి బీచ్ శాండ్ మినరల్స్ నిలిపివేయండి.. గవర్నర్‌కు రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2023-12-01T10:49:33+05:30 IST

Andhrapradesh: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ ఆదానీ కంపెనీకి అప్పగించటాన్ని నిలుపుదల చేయాలని కోరారు. 2019లో ప్రైవేట్ బీచ్ శాండ్ మైనింగ్‌పై నిషేధం విధించారన్నారు.

Ramakrishna: ఆదానీ కంపెనీకి బీచ్ శాండ్ మినరల్స్ నిలిపివేయండి.. గవర్నర్‌కు రామకృష్ణ లేఖ

హైదరాబాద్: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు (AP Governor Abdul Nazir) సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (CPI Leader Ramakrishna) లేఖ రాశారు. ఏపీలో బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ ఆదానీ కంపెనీకి అప్పగించటాన్ని నిలుపుదల చేయాలని కోరారు. 2019లో ప్రైవేట్ బీచ్ శాండ్ మైనింగ్‌పై నిషేధం విధించారన్నారు. బీచ్ శాండ్ మినరల్స్‌లో అణుధార్మిక శక్తికి సంబంధించిన ఖనిజాలుంటాయని తెలిపారు. బీచ్ శాండ్ మైనింగ్‌ను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వలన దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ భద్రత అంశాన్ని అదానీకి తాకట్టు పెట్టేందుకు సిద్ధమవటం దుర్మార్గమని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2023-12-01T10:49:36+05:30 IST