AP MLC Results: జగన్‌కు కౌంట్ డౌన్ మొదలైంది: బొరగం

ABN , First Publish Date - 2023-03-19T21:24:57+05:30 IST

సీఎం జగన్‌కు (CM Jagan) కౌంట్ డౌన్ మొదలైందని పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu)హెచ్చరించారు.

AP MLC Results: జగన్‌కు కౌంట్ డౌన్ మొదలైంది: బొరగం

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): సీఎం జగన్‌కు (CM Jagan) కౌంట్ డౌన్ మొదలైందని పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu)హెచ్చరించారు. ఇప్పటి నుంచి ఏ ఎన్నిక జరిగినా టీడీపీదే విజయమని జోస్యం చెప్పారు. మూడు పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా బుట్టాయగూడెం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి శ్రీనివాసులు కేక్ కట్ చేశారు. గెలిచిన టీడీపీ (TDP) అభ్యర్థులకు బొరగం అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైసీపీ ప్రభుత్వంపై విసిగి పోయారని, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరనే నిర్ణయానికి ప్రజలు వచ్చారని శ్రీనివాసులు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ తెలుగు రైతు కార్యదర్శి గద్దె అబ్బులు, కుందుల శ్రీను, మాటురి ముసలయ్య, మోజేష్, అడవి రాముడు వరక కృష్ణరాజు, రేలంగి ప్రసాద్, మడకం. కన్నపరాజు, కుంజం రాజు, మడకం రాంబాబు, కుంజం ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T21:24:57+05:30 IST