Jagan: కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఘనస్వాగతం

ABN , First Publish Date - 2023-02-22T22:39:56+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ (New Governor) గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు.

Jagan: కొత్త గవర్నర్‌కు సీఎం జగన్‌ ఘనస్వాగతం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త గవర్నర్ (New Governor) గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్న జస్టిస్ అబ్దుల్ నజీర్ (Justice Abdul Nazir)కు ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (CM Jaganmohan reddy) ఘనస్వాగతం పలికారు. ఏపీ గవర్నర్గా ఎల్లుండి జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతకు ముందుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్‌ (Biswabhushan Harichandan) కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు. గన్నవరం విమానాశ్రయంలో బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎంతో సహా సీఎస్ జవహర్ రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, ఉన్నతాధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. మూడున్నర సంవత్సరాల పాటు ఏపీ గవర్నర్ గా పనిచేసేందుకు తనకు సహకరించిన వారందరికీ బిశ్వభూషణ్ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2023-02-22T23:07:41+05:30 IST