JAGAN: 4న ఢిల్లీకి సీఎం జగన్.. మోదీతో భేటీ

ABN , First Publish Date - 2023-07-01T19:56:55+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) జూలై 4వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు.

JAGAN: 4న ఢిల్లీకి సీఎం జగన్.. మోదీతో భేటీ

తాడేపల్లి, గుంటూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) జూలై 4వ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు. జూలై 5వ తేదీన ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో (Prime Minister Narendra Modi) సీఎం జగన్ సమావేశం కానున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు పలు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ తాజా చార్జిషీట్ నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated Date - 2023-07-01T21:19:43+05:30 IST