Tirupathi: తిరుమలలో భక్తుల రద్దీ..

ABN , First Publish Date - 2023-06-02T07:20:12+05:30 IST

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు.

Tirupathi: తిరుమలలో భక్తుల రద్దీ..

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. టోకెన్ రహిత సర్వదర్శనానికి క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోయి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

కాగా నిన్న శ్రీవారికి 4.56 కోట్ల రూపాయల హుండీ ఆదాయం వచ్చింది. 62,407 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా.. 33,895 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కాగా తిరుమల సన్నిధిలో మరో అతిథి గృహం అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఫోనిక్స్ పవర్ అండ్ ఇన్ ఫ్రా సంస్థ తిరుమలలోని సన్నిధానం అతిథి గృహం సమీపంలో నిర్మించిన వేంకటేశ్వర అతిథి గృహాన్ని దాతలు గురువారం టీటీడీకి అప్పగించారు.

Updated Date - 2023-06-02T07:20:12+05:30 IST