Bopparaju: ఏపీ సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.. ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ నిర్వహించడం చరిత్రలో మొదటిసారి..

ABN , First Publish Date - 2023-07-02T17:15:02+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి (AP Chief Minister YS Jaganmohan Reddy) ఏపీ ఎన్జీవో సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) తెలియజేశారు.

Bopparaju: ఏపీ సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు.. ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ నిర్వహించడం చరిత్రలో మొదటిసారి..

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి (AP Chief Minister YS Jaganmohan Reddy) ఏపీ ఎన్జీవో సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) తెలియజేశారు. ప్రతినెల 3వ శుక్రవారం జీవో ద్వారా ఉద్యోగుల కోసం గ్రీవెన్స్ నిర్వహించడం చరిత్రలో మొదటిసారి అని బొప్పరాజు చెప్పారు రూ. 500 కోట్లు, డీఏ, టీఏలు, సీపీఎస్ రద్దు అంశంపై 47 సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా 37 అంశాలు పరిష్కారమయ్యాయని తెలిపారు.

ఇందుకుగానూ రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యేలలో 142 మంది ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన చెప్పారు. 13 లక్షల మంది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అందరినీ కలుస్తున్నామని బొప్పరాజు వెంకటేశ్వర్లు (bopparaju venkateswarlu) అన్నారు. రెండో జోన్‌లో ఉన్న ఉద్యోగస్తులందరితో సమావేశమయ్యామని ఆయన అన్నారు.

Updated Date - 2023-07-02T17:44:47+05:30 IST