Chandrababu: జేపీ నడ్డాతో చంద్రబాబు మాటా మంతీ

ABN , First Publish Date - 2023-08-28T12:02:16+05:30 IST

రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు మాటా మంతీ ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాలతో పాటు, ఏపీ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది.

Chandrababu: జేపీ నడ్డాతో చంద్రబాబు మాటా మంతీ

ఢిల్లీ : రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు మాటా మంతీ ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాలతో పాటు, ఏపీ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది. ఏపీలో జగన్ పాలన వైఫల్యాలను జేపీ నడ్డాకు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. ఓటర్ల తొలగింపు అక్రమాలనూ నడ్డా దృష్టికి చంద్రబాబు తీసుకొచ్చారు. కాగా.. ఈ కార్యక్రమం అనంతరం చంద్రబాబు ఎన్నికల కమిషన్‌ను కలవనున్నారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలుస్తోంది.

కాగా.. నేటి ఉదయం ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan) సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) చేతుల మీదుగా నాణెం విడుదల చేయడం జరిగింది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో నాణెం తయారు చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు.

Updated Date - 2023-08-28T12:44:43+05:30 IST