AP News: చంద్రబాబుతో బొరగం శ్రీనివాసులు భేటీ

ABN , First Publish Date - 2023-05-11T21:03:01+05:30 IST

మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)తో పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) భేటీ అయ్యారు.

AP News: చంద్రబాబుతో బొరగం శ్రీనివాసులు భేటీ

జంగారెడ్డిగూడెం (ఏలూరు జిల్లా): మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)తో పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu) భేటీ అయ్యారు. ఇటీవల కురిసిన ఆకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను, రైతుల అవస్థలను చంద్రబాబు దృష్టికి శ్రీనివాసులు తెచ్చారు. అలాగే పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అంతేకాకుండా ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం, పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు, సీఎం జగన్ (CM Jagan) నిర్వాసితులకు హామీల అమలుపై చంద్రబాబుతో చర్చించారు. పోలవరం నియోజకవర్గం పార్టీ చేపడుతున్న కార్యక్రమాలను చంద్రబాబు ఆరా తీశారు. పార్టీ కార్యక్రమాలు చొరవతో నిర్వహిస్తున్న.. శ్రీనివాసులును చంద్రబాబు ప్రశంసించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలని, ఓటర్ హౌస్ మ్యాపింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని బొరగంకు చంద్రబాబు సూచించారు.

Updated Date - 2023-05-11T21:03:01+05:30 IST