TDP: మహానాడు తీర్మానాలపై కమిటీ సభ్యుల భేటీ

ABN , First Publish Date - 2023-05-20T19:54:35+05:30 IST

మహానాడు తీర్మానాలపై కమిటీ భేటీ అయింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) నేతృత్వంలో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.

TDP: మహానాడు తీర్మానాలపై కమిటీ సభ్యుల భేటీ

అమరావతి: మహానాడు తీర్మానాలపై కమిటీ భేటీ అయింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) నేతృత్వంలో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. సుమారు 25కు పైగా తీర్మానాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల పని తీరు, ప్రజా సమస్యలపై 15-19 తీర్మానాలు చేయాలని నిర్ణయించింది. దూరమైన వర్గాలను దగ్గర చేసుకునేలా తీర్మానాల రూపకల్పనగా పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులు.. జాతీయ పార్టీలతో వ్యవహరించాల్సిన తీరును రాజకీయ తీర్మానంలో టీడీపీ ప్రస్తావించనుంది. రైతులు, యువత, మహిళల సంక్షేమంపై ఎలాంటి మేనిఫెస్టో రూపొందిస్తామనే దానిపై మహానాడులో టీడీపీ క్లారిటీ ఇవ్వనుంది. టీడీపీ అధికారంలో వస్తే సంక్షేమ పథకాలు ఎత్తేస్తారనే విమర్శలకు మహానాడు వేదికగా సమాధానం ఇచ్చేలా కసరత్తు చేస్తోంది. టీడీపీ హయాంలో ఇచ్చిన సంక్షేమాన్ని లెక్కలతో సహా మహానాడు వేదికగా టీడీపీ వివరించనుంది. గతంలో కూడా ప్రస్తుత జగన్ ప్రభుత్వం కంటే ఎక్కువగానే సంక్షేమానికి నిధులిచ్చామని లెక్కలతో టీడీపీ వివరించనుంది.

Updated Date - 2023-05-20T19:56:21+05:30 IST