AP News: ‘డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం ఆపం’
ABN , First Publish Date - 2023-05-23T15:55:13+05:30 IST
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) తెలిపారు.
ఏలూరు: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై గత 70 రోజులుగా ఏపీ జేఏసీ (JAC) అమరావతి ఆధ్వర్యంలో పోరాడుతున్నామన్నారు. ఉద్యోగులకు బకాయి పడ్డ కోట్లాది రూపాయలు జీతాలను ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 27, 28వ తేదీల్లో ఏలూరు, గుంటూరులో ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు.