AP News: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-30T20:24:57+05:30 IST

ఏపీ ప్రభుత్వం (AP Govt) పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం బిల్లుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు (Highcourt) ను ఏలూరు మహిళలు ఆశ్రయించారు.

AP News: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: ఏపీ ప్రభుత్వం (AP Govt) పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం బిల్లుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు (Highcourt) ను ఏలూరు మహిళలు ఆశ్రయించారు. వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రభుత్వ తీరుపై హైకోర్టు సీరియస్ అయ్యింది. పేదలంటే అంత కక్ష ఎందుకు మీకు? అని హైకోర్టు ప్రశ్నించింది. రూ.58 వేలు చెల్లింపునకు కూడా కోర్టును ఆశ్రయించాలా? అని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే పరిస్థితి మీరే కల్పిస్తున్నారని కోర్టు పేర్కొంది. ఉద్యోగుల జీపీఎఫ్‌ సొమ్మును మళ్లించడం ఏంటి? అని హైకోర్టు ప్రశ్నించింది. ఏ కారణాలతో బిల్లు చెల్లించలేకపోయారో అఫిడవిట్ వేయాలని గృహనిర్మాణశాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2023-01-30T20:24:59+05:30 IST