Share News

AP: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2023-11-23T17:19:17+05:30 IST

ఆంధ్రా నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను సూళ్లూరుపేటలో పోలీసులు అరెస్ట్ చేశారు.

AP: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

ఉమ్మడి నెల్లూరు: ఆంధ్రా నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను సూళ్లూరుపేటలో పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను సూళ్లూరుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని నుంచి బెంగుళూరుకు 24 కేజీలు గంజాయిని ఆర్టీసీ బస్సుల్లో అక్రమంగా తరలిస్తున్నారు. 24 కేజీలు గంజాయిని సీజ్ చేసి బెంగళూరుకు చెందిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు సూళ్లూరుపేట సెబ్ పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షల విలువ చేసే గంజాయి సీజ్ చేశారు.

Updated Date - 2023-11-23T17:19:21+05:30 IST