AP News: అనంతలో ఏపీయూడబ్ల్యూజే నిరసన

ABN , First Publish Date - 2023-05-22T11:52:38+05:30 IST

జిల్లాలో జర్నలిస్టులు నిరసనకు దిగారు. జర్నలిస్టులపై దాడి చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.

AP News: అనంతలో ఏపీయూడబ్ల్యూజే నిరసన

అనంతపురం: జిల్లాలో జర్నలిస్టులు నిరసనకు దిగారు. జర్నలిస్టులపై దాడి చేసిన ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, ఆంధ్రజ్యోతి అనంతపురం జిల్లా బ్యూరో ఇంచార్జ్ రామకృష్ణ, జిల్లా జర్నలిస్టులు నగరంలోని సంగమేశ్వర సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసనకు సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ లీడర్లు మద్దతు తెలిపారు. కర్నూలులో హైదరాబాదులో న్యూస్ కవరేజ్‌కు వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేసిన అవినాష్ రెడ్డి అనుచరులను అరెస్టు చేయాలని ఆందోళనకు దిగారు. సీబీఐ అరెస్టు భయంతో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారని ఆక్రోషం వెళ్లగక్కారు. వాక్ స్వాతంత్రాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు

Updated Date - 2023-05-22T11:54:18+05:30 IST