AP News: ప్రైవేట్ కాలేజ్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2023-09-07T10:51:33+05:30 IST

జిల్లాలో ఓ ప్రైవేటు కాజేల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.

AP News: ప్రైవేట్ కాలేజ్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

ఎన్టీఆర్ జిల్లా: జిల్లాలో ఓ ప్రైవేటు కాజేల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజి కి చెందిన బస్సు గంపలగూడెం మండలం వినగడప వద్ద కట్టలేరు బ్రిడ్జి మీదగా వెళుతుండగా రోడ్డు కుంగడంతో బస్సుకు పక్కకు ఒరిగిపోయింది. రెండు రోజులుగా కురుసిన వర్షానికి వదర రావడంతో తాత్కాలిక రోడ్డు కుంగిపోయింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఒక్కొక్కరుగా బస్సులో నుంచి దిగా ప్రాణాలు దక్కించుకున్నారు. బ్రిడ్జిపై ప్రమాదం తప్పడంతో బస్సు డ్రైవర్, విద్యార్థులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బస్సును అక్కడి నుంచి తొలగించేందుకు యత్నిస్తున్నారు.

Updated Date - 2023-09-07T10:51:33+05:30 IST