AP NEWS: నెల్లూరు పెంచలకొన జలపాతం వద్ద 11 మంది గల్లంతు.. ఆ తర్వాత..
ABN , First Publish Date - 2023-11-29T19:33:36+05:30 IST
పెంచలకొన జలపాతం వద్ద కాసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. జలపాతం చూసేందుకు వెళ్లిన 11 మంది అయ్యప్ప స్వాములు గల్లంతు అయ్యారు.
![AP NEWS: నెల్లూరు పెంచలకొన జలపాతం వద్ద 11 మంది గల్లంతు.. ఆ తర్వాత..](https://media.andhrajyothy.com/media/2023/20231129/water_5b55b45e0b.jpg)
నెల్లూరు: పెంచలకొన జలపాతం వద్ద కాసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. జలపాతం చూసేందుకు వెళ్లిన 11 మంది అయ్యప్ప స్వాములు గల్లంతు అయ్యారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు ఒక్కసారిగా వరద భారీగా రావడంతో అయ్యప్ప స్వాములు దారి తప్పిపోయారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది రేస్క్యు ఆపరేషన్తో అయ్యప్ప స్వాముల ఆచూకీ లభ్యమైంది. ఘటనా స్థలం నుంచి అయ్యప్ప స్వాములు సురక్షితంగా సొంత ప్రాంతాలకు వెళ్లారు.