TS News: మాకు ఉద్యోగాలు కల్పించండి.. హిజ్రాల ఆందోళన

ABN , First Publish Date - 2022-12-09T10:15:41+05:30 IST

కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుడ్య పరీక్షలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీ దగ్గర హిజ్రాలు ఆందోళనకు దిగారు.

TS News: మాకు ఉద్యోగాలు కల్పించండి.. హిజ్రాల ఆందోళన

వరంగల్: కానిస్టేబుల్, ఎస్ఐ దేహదారుడ్య పరీక్షలు జరుగుతున్న కాకతీయ యూనివర్సిటీ దగ్గర హిజ్రాలు (Hijras protest near Kakatiya University) ఆందోళనకు దిగారు. ఆడ, మగతో పాటు తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం 12 మంది ట్రాన్స్ జెండర్స్ రాత పరీక్షలకు హాజరయ్యారు. నందిని, తనుశ్రీ, లవ్ లీ, శ్రావ్య శ్రీ అనే నలుగురు ట్రాన్స్ జెండర్స్ రాత పరీక్షల్లో అర్హత సాధించారు. ఈ క్రమంలో పోలీస్ ఉద్యోగ నియమకాలలో ట్రాన్స్‌జెండర్ యాక్ట్ అమలు చేయాలని హిజ్రాలు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-12-09T10:15:43+05:30 IST