Vinay Bhasker: పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు

ABN , First Publish Date - 2022-11-29T12:34:58+05:30 IST

పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు.

Vinay Bhasker: పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు

హనమకొండ: పాదయాత్రలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Vinay bhasker) విమర్శించారు. కాళోజీ చౌరస్తాలో దీక్షాదివస్‌లో దాస్యం వినయ్ బాస్కర్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూసే వారి ఆటలు సాగనివ్వబోమని తెలిపారు. 2009లో కేసీఆర్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష వల్లే తెలంగాణ ఆవిర్భావం జరిగిందన్నారు. అదే స్ఫూర్తితో అభివృద్ధి చేస్తున్నామని వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.

Updated Date - 2022-11-29T12:35:00+05:30 IST