YS Sharmila: అత్యాచారాలలో నంబర్ 1 తెలంగాణ

ABN , First Publish Date - 2022-11-19T21:02:42+05:30 IST

Hanumakonda: దక్షిణ భారతంలో అత్యాచారాలలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని వైఎస్‌ఆర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శనివారం ఆమె చేపట్టిన మహా ప్రస్థానం పాదయాత్ర కమలాపూర్ మండల కేంద్రంలో సాగింది.

YS Sharmila: అత్యాచారాలలో నంబర్ 1 తెలంగాణ

Hanumakonda: దక్షిణ భారతంలో అత్యాచారాలలో తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని వైఎస్‌ఆర్‌టీపీ (YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శనివారం ఆమె చేపట్టిన మహా ప్రస్థానం పాదయాత్ర కమలాపూర్ మండల కేంద్రంలో సాగింది. ఈ సందర్భంగా హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ (Rajender)నుద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ.. ‘‘మీఎమ్మెల్యే గతంలో టీఆర్ఎస్‌(TRS)లో ఉన్నప్పుడు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీ‌(BJP)లో ఉన్నాడు. ఇప్పుడు ఏమైనా ఒరిగిందా..? మీకు ఇళ్లు లేవు...కొత్త పింఛన్లు లేవు.. మీ ఓట్లతో ఎన్నికల్లో గెలిచి నియోజక వర్గంలో గూండాగిరి చేస్తున్నారు. తెలంగాణ తాగుబోతుల తెలంగాణ అయ్యింది. గుడులు బడులు కన్నా... మద్యం షాపులు ఎక్కువయ్యాయి.’’ అని కేసీఆర్ (CM KCR) సర్కారును విమర్శించారు.

Updated Date - 2022-11-19T21:02:44+05:30 IST