TS News: భార్యను హత్య చేసి ఆపై....

ABN , First Publish Date - 2022-12-09T09:33:00+05:30 IST

జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

TS News: భార్యను హత్య చేసి ఆపై....

వికారాబాద్: జిల్లాలోని పరిగి మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యను హత్య చేసిన భర్త ఆపై తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కావలి భీమయ్య (50) అనే వ్యక్తి నిద్రిస్తున్న భార్య పెంటమ్మ (45) గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం భీమయ్య ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొన్ని రోజులుగా భీమయ్య మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-09T09:33:01+05:30 IST