Bandi Sanjay: రేపటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర
ABN , First Publish Date - 2022-11-27T09:47:13+05:30 IST
నిర్మల్ జిల్లా: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సోమవారం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) చేయనున్నారు.
నిర్మల్ జిల్లా: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) సోమవారం నుంచి ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra) చేయనున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు పాదయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు నియోజకవర్గాల్లో 10 రోజుల పాటు 114 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. కాగా భైంసాలో ప్రారంభ సభకు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) హాజరుకానున్నారు.