Congress: టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-06T12:18:35+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ సిద్ధిపేట

Congress: టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం
దోపిడీ ప్రభుత్వం

సిద్దిపేట: టీఆర్ఎస్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూమ్ కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ సిద్ధిపేట కలెక్టర్ కార్యాలయం ఎదుట చీలసాగరం రమేష్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేష్ కుటుంబాన్నిగజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో పరామర్శించారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనసు గెలవాలి కానీ డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రజల్ని లంచాలు అడిగి దోచుకుంటున్నారని మండిపడ్డారు. గజ్వేల్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధిపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-12-06T12:18:37+05:30 IST