TS News: శిశువుల తారుమారు వివాదంపై వైద్యఆరోగ్యశాఖ చర్యలు

ABN , First Publish Date - 2022-12-31T13:00:03+05:30 IST

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు వివాదంపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.

TS News: శిశువుల తారుమారు వివాదంపై వైద్యఆరోగ్యశాఖ చర్యలు

మంచిర్యాల: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువుల తారుమారు వివాదంపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. బాధిత పిల్లలు, తల్లుల రక్త నమూనాలను అధికారులు సేకరించి డీఎన్ఏ టెస్టుకు పంపించారు. ఆపరేషన్ థియేటర్‌లో విధులు నిర్వహించిన స్టాఫ్ నర్స్‌తో పాటు సహాయకురాలిపై వేటు పడింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను విధుల నుంచి టర్మినేట్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. వారం రోజుల్లో డీఎన్ఏ రిపోర్ట్ వస్తుందని... ఆ తర్వాతనే తల్లిదండ్రులకు పిల్లలను అప్పగిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. హరిశ్చంద్ర రెడ్డి తెలిపారు.

Updated Date - 2022-12-31T13:00:04+05:30 IST