Vidyasagar Rao: ఆర్థిక సంస్కరణలకు పీవీనే కారణం

ABN , First Publish Date - 2022-12-23T14:11:23+05:30 IST

ముస్లింలకు, క్రైస్తవులకు బీజేపీ వ్యతిరేకం కాదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు (Former Maharashtra Governor Vidyasagar Rao) తెలిపారు. ఆయన మీడియాతో

Vidyasagar Rao: ఆర్థిక సంస్కరణలకు పీవీనే కారణం
పీవీనే కారణం

హైదరాబాద్: ముస్లింలకు, క్రైస్తవులకు బీజేపీ వ్యతిరేకం కాదని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు (Former Maharashtra Governor Vidyasagar Rao) తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఒక్క‌ ఓటుతో ప్రధానమంత్రి పదవిని వదులుకున్న విలువలు కలిగిన గొప్ప నేత వాజపేయి(Atal Bihari Vajpayee). పరిపాలన దక్షతతో వాజపేయి విశ్వ గురువుగా మిగిలిపోయారు. పీవీ నరసింహారావు, వాజపేయిలు అధికార, ప్రతిపక్ష నాయకులుగా దేశానికి ఆదర్శంగా నిలిచారు. బీజేపీ(bjp) దేశంలో ఇంత బలంగా ఉండటానికి కారణం వాజపేయి. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. విలువలు కలిగిన నేత కాబట్టే వాజపేయిని ప్రధానమంత్రిని చేయటానికి 24 పార్టీల మందుకొచ్చాయి. నాంపల్లి బీజేపీ కార్యాలయం భారతీయ సంస్కృతికి పరంపర. వాజపేయితో వ్యక్తిగతంగా నాకు చాలా సాన్నిహిత్యం ఉండేది. 1975లో వాజపేయి కరీంనగర్ వచ్చినప్పుడు.. పార్టీకి 50 వేల డొనేషన్ ఇవ్వటానికి చాలా కష్టం చేయాల్సి వచ్చింది. దేశంలో ఆర్థిక సంస్కరణలకు కారణం పీవీ నరసింహారావు (PV Narasimha Rao) అనే సత్యాన్ని ఒప్పుకోవాల్సిందే.’’ అని ఖ్యానించారు.

Updated Date - 2022-12-23T14:11:25+05:30 IST