MLAs Purchase case: రెండో రోజు నందును విచారిస్తున్న పోలీసులు
ABN , First Publish Date - 2022-11-29T11:00:35+05:30 IST
ఎమ్మెల్యేల ఎర కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
హైదరాబాద్: ఎమ్మెల్యేల ఎర కేసు (MLAs Purchase case)లో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఏ2 నందు కుమార్ను రెండో రోజు బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. చంచల్గూడ నుంచి నందును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు... లాయర్ నాగరాజు సమక్షంలో ప్రశ్నిస్తున్నారు. దక్కన్ చికెన్ హోటల్ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు, లీజ్ అగ్రిమెంట్పై పోలీసులు ప్రశ్నలు కురిపిస్తున్నారు. మొత్తం మూడు కేసుల్లో నందును పోలీసులు విచారిస్తున్నారు.
నాంపల్లి కోర్టు అనుమతితో నందకుమార్ను పోలీసులు రెండు రోజుల పాటు విచారించనున్నారు. నిన్న సుదీర్ఘంగా ఐదున్నర గంటల పాటు పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.