MLA Jaggareddy: చంద్రబాబు ఇక కేసీఆర్‌తో ఆడుకుంటారు..

ABN , First Publish Date - 2022-12-26T14:22:49+05:30 IST

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) పార్టీ పేరు నుంచి ‘టి’ తొలగించి తెలంగాణ (Telangana)ను అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) అన్నారు.

MLA Jaggareddy: చంద్రబాబు ఇక కేసీఆర్‌తో ఆడుకుంటారు..

హైదరాబాద్: సీఎం కేసీఆర్ (CM KCR) పార్టీ పేరు నుంచి ‘టి’ తొలగించి తెలంగాణ (Telangana)ను అవమానించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MLA Jaggareddy) అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఏపీ (AP)కి వెళుతున్నారు కాబట్టి చంద్రబాబు (Chandrababu) తెలంగాణకు వచ్చారని, సైలెంట్‌గా ఉన్న బా

బును తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశం ఇచ్చారన్నారు. కేసీఆర్ ఏపీలో అట్రాక్ట్ చేయలేరు.. కానీ బాబు తెలంగాణను అట్రాక్ట్ చేయగలరని అన్నారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని, సీఎంలో ఎక్కడో ఓ మూలన సమైక్య భావన ఉందన్నారు. తెలంగాణ వాదాన్ని ముఖ్యమంత్రి చంపేశారని, రాజకీయ బ్రతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేశారన్నారు.

చంద్రబాబు ఇక కేసీఆర్‌తో ఆడుకుంటారని, కూటములు, పొత్తులపై ముందు ముందు తెలుస్తుందని, తెలంగాణలో ఇక సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని జగ్గారెడ్ది అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకకు బిఆర్ఎస్ వెళితే టీడీపీ కూడా వెళుతుందన్నారు. బిఆర్ఎస్‌తో కేసీఆర్ సక్సస్ అయ్యే పరిస్థితి ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక మైనార్టీ లోన్స్ ఇవ్వడం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద శాతం సబ్సిడీతో చిరు వ్యాపారులకు లోన్స్ ఇచ్చామన్నారు. ఇటీవల ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్‌కు రూ. 120 కోట్లు కేటాయించిందని, ఆ డబ్బు ఏ మాత్రం సరిపోదని, కేవలం 1200 మందికి మాత్రమే సరిపోతాయన్నారు. మైనార్టీ కార్పొరేషన్‌కు కనీసం రూ. 1500 కోట్లు కేటాయించాలన్నారు. అప్లికేషన్ గడువును జనవరి 5వ తేదీ వరకే విధించారని.. మైనార్టీ కార్పొరేషన్ లోన్ దరఖాస్తు గడువును పెంచాలని జగ్గారెడ్డి కోరారు.

Updated Date - 2022-12-26T14:22:53+05:30 IST