TS News: నేను ఎవరితోనూ విబేధాలు పెట్టుకోను: మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2022-12-20T11:32:14+05:30 IST

హైదరాబాద్: ఎమ్మెల్యేల భేటీపై మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గాంధేయవాదినని..

TS News: నేను ఎవరితోనూ విబేధాలు పెట్టుకోను: మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్యేల భేటీపై మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గాంధేయవాదినని.. ఎవరితోనూ విభేదాలు పెట్టుకోనని అన్నారు. తమ మధ్య అంతా సమస్య లేదని, తానే ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి వారితో మాట్లాడతానన్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను తన ఇంటికి ఆహ్వానిస్తానని.. ఇది మా ఇంటి సమస్య అని మీడియానే ఎక్కువగా చూపిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ క్రమశిక్షణ గల పార్టీ అని.. పదవులు ఇచ్చేది తాను కాదని.. కేసీఆర్, కేటీఆర్ ఇస్తారని మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేశారు.

మంత్రి మల్లారెడ్డి తీరుపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, భేతి సుభాష్ రెడ్డి, అరికపూడి గాంధీ నిన్న సమావేశం అయ్యారు. నామినేటెడ్ పదవుల పంపకంపై నెలకొన్న అసమ్మతి పార్టీ వేదికలు దాటి మీడియా వరకు వచ్చింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల భేటీపై మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-20T11:32:19+05:30 IST