Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చే ఉద్దేశ్యం మాకు లేదు.. నిరాశతోనే టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడులు

ABN , First Publish Date - 2022-11-18T18:37:26+05:30 IST

బీజేపీ (Bjp) ఎంపీ అర్వింద్‌ తల్లిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పరామర్శించారు.

Kishan Reddy: కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చే ఉద్దేశ్యం మాకు లేదు.. నిరాశతోనే టీఆర్‌ఎస్‌ శ్రేణుల దాడులు
కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి

హైదరాబాద్: బీజేపీ (Bjp) ఎంపీ అర్వింద్‌ తల్లిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పరామర్శించారు. దాడి ఘటనపై కిషన్‌రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చే ఉద్దేశ్యం తమకు లేదని, కేసీఆర్‌ ఫ్యామిలీని బీజేపీలో చేర్చుకోవాలనే ఆలోచన తమకు లేదని కిషన్ రెడ్ స్పష్టం చేశారు. భయపెట్టి పార్టీలో చేర్చుకునే సంస్కృతి తమది కాదని కిషన్‌రెడ్డి అన్నారు. రాజీనామాలు కూడా చేయించకుండా కేసీఆర్‌ పార్టీలో చేర్చుకున్నారని, పార్టీ ఫిరాయింపులపై కేసు పెట్టాలంటే కేసీఆర్‌ మీదే పెట్టాలని కిషన్‌రెడ్డి చెప్పారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిరాశతోనే దాడులకు దిగుతున్నారని కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-11-18T18:37:28+05:30 IST