Indira Shobhan: కేసీఆర్ టైం దగ్గర పడింది

ABN , First Publish Date - 2022-12-06T12:49:53+05:30 IST

బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరా శోభన్ అన్నారు.

Indira Shobhan: కేసీఆర్ టైం దగ్గర పడింది

హైదరాబాద్: బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఇందిరా శోభన్ అన్నారు. అంబేద్కర్ వర్థంతి సందర్భంటా ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇందిరా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎనిమిది సంవత్సరాల్లో ఒక్కనాడు కూడా అంబేద్కర్ జయంతికి, వర్థంతికి కేసీఆర్ నివాళులు అర్పించలేదన్నారు. కేసీఆర్ టైం దగ్గర పడిందని వ్యాఖ్యలు చేశారు. వాస్తు కారణంగానే నూతన సెక్రటేరియట్ కూల్చి కొత్తది కట్టారని తెలిపారు. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరికి కూడా అంబేద్కర్ జయంతి, వర్ధంతి గుర్తుండవా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉందా అంటూ నిలదీశారు. అంబేద్కర్ ఇచ్చిన తెలంగాణను ఆమ్ ఆద్మీ పార్టీ కాపాడుకుంటుందన్నారు. కేటీఆర్‌కు అంబేద్కర్‌కు నివాళులు అర్పించే సమయం ఉండదు కానీ, ప్రైవేట్ హోటల్స్ ఓపెన్ చేయడానికి సమయం ఉంటుందా అంటూ ఇందిరా శోభన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-06T12:49:53+05:30 IST