TS News: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-11-28T15:49:16+05:30 IST

నిర్మల్‌ జిల్లా: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

TS News: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నిర్మల్‌ జిల్లా: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నిర్మల్‌ (Nirmal)లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కర్ణాటక (Karnataka)తో పాటు తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ఎన్నికలుండే (Elections) అవకాశం ఉందన్నారు. బీజేపీ (BJP) నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికార దుర్వినియోగంతోనే మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ (TRS) గెలిచిందని విమర్శించారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR)లో భయం నెలకొందన్నారు. కాంగ్రెస్ (Congress) పార్టీకి భవిష్యత్తు లేదని, ఆ పార్టీలో బలమైన నాయకుల్లేరని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆలోచించి బీజేపీలోకి రావాలని పిలుపిచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో పది స్థానాల్లో బీజేపీని గెలిపించే బాధ్యత తనదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2022-11-28T15:49:20+05:30 IST