3rd ODI: మళ్లీ టాస్ బంగ్లాదే.. రెండు మార్పులతో బరిలోకి భారత్..

ABN , First Publish Date - 2022-12-10T11:59:17+05:30 IST

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన మూడో వన్డేలో మొదట టాస్ గెలిచిన ఆతిథ్య బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది.

3rd ODI: మళ్లీ టాస్ బంగ్లాదే.. రెండు మార్పులతో బరిలోకి భారత్..

చిట్టగాంగ్‌: భారత్‌తో (India) మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన మూడో వన్డేలో మొదట టాస్ (Toss) గెలిచిన ఆతిథ్య బంగ్లాదేశ్ (Bangladesh) బౌలింగ్ (Bowling) ఎంచుకుంది. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన రోహిత్ శర్మ (Rohit Sharma) బదులు కేఎల్ రాహుల్ (KL Rahul) సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ వన్డేలో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. రోహిత్ స్థానంలో ఇషాన్ కిషన్, దీపక్ చాహర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఇక వరుసగా రెండు పరాజయాలతో సిరీస్ కోల్పోయిన భారత జట్టు ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. ఈ ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా (Team India) గెలిచి ఓదార్పు విజయమైనా దక్కించుకుంటుందా? లేదా వైట్‌వాష్‌కు గురవుతుందా? అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

జట్ల వివరాలు:

టీమిండియా: శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

బంగ్లాదేశ్: అనముల్ హాక్, లిట్టన్ దాస్ (కెప్టెన్), యాసిర్ అలీ, షకిబల్ హాసన్, ముష్ఫికర్ రహీం, మహమ్మదుల్లా, అరిఫ్ హుస్సేన్, మెహదీ హసన్ మిర్జా, ఎబత్ హుస్సేన్, ముస్తాఫిజర్ రహమాన్, టస్కిన్ అహ్మద్

Updated Date - 2022-12-10T12:13:39+05:30 IST