Shocking: మద్యం మత్తులో భర్తపై దాడి చేసిన నవ వధువు.. ప్రాణ భయంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భర్త!
ABN , First Publish Date - 2022-08-22T16:25:36+05:30 IST
సాధారణంగా మద్యం మత్తులో భార్యపై దాడి చేసే భర్తల గురించే మనం ఎక్కువగా వింటుంటాం.
సాధారణంగా మద్యం మత్తులో భార్యపై దాడి చేసే భర్తల గురించే మనం ఎక్కువగా వింటుంటాం. అయితే రాజస్థాన్లో అలీగఢ్లో తాజాగా ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ నవ వధువు బాగా మద్యం సేవించి (Drunken wife) తన భర్తపై దాడి చేసింది. అతడిని పళ్లతో కొరికింది. ఇష్టమొచ్చినట్టు కొట్టింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీస్స్టేషన్కు చేరుకుని తనకు సహాయం అందించాలని వేడుకున్నాడు. అలీగఢ్కు సమీపంలోని జట్టారికి చెందిన ఓ వ్యక్తికి గత నెలలో వివాహం జరిగింది.
ఇది కూడా చదవండి..
Viral Video: ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్న సమయంలో అనుకోని సంఘటన.. చివరకు ఏం జరిగిందంటే..
అతడి భార్యకు మద్యంతో పాటు గంజాయి కూడా సేవించే అలవాటు ఉందని ఇటీవలె అతడికి తెలిసింది. శనివారం రాత్రి కూడా ఆమె ఇంట్లోనే మద్యం సేవించింది. దీంతో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన మహిళ తన భర్తపై దాడి చేసింది. ఇష్టమొచ్చినట్టు కొట్టింది. అలాగే చేతులపై, ఛాతీపై గట్టిగా కొరికేసింది. దీంతో ఆ వ్యక్తి తర్వాతి రోజు ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్కు చేరుకుని తన భార్యపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.