అతనేం చేస్తున్నాడో అర్థమై పరిగెత్తిన మహిళ.. పోలీసులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో ట్విటర్ ద్వారా ఫిర్యాదు చేస్తే..
ABN , First Publish Date - 2022-06-03T18:13:57+05:30 IST
ఆమె ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేస్తోంది.. ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి తనకు అడ్రస్ చెప్పాలని అడిగాడు..
ఆమె ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేస్తోంది.. ఒక వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చి తనకు అడ్రస్ చెప్పాలని అడిగాడు.. అతనికి ఆమె సహాయం చేసేందుకు ప్రయత్నించింది.. ఈ క్రమంలో అతను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. దీంతో ఆమె ప్లాట్ఫామ్ మీద ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్కు ఫిర్యాదు చేసింది.. అతను పట్టించుకోకుండా పై ఫ్లోర్లో ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నాడు.. అక్కడకు వెళ్లి ఫిర్యాదు చేస్తే వారు కూడా స్పందించలేదు.. దానిని పెద్ద సీన్ చేయవద్దని ఆమెకు సూచించారు.. దీంతో ఆమె ట్విటర్ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేసింది.
ఇది కూడా చదవండి..
మీ కొడుకును చంపబోతున్నారు.. కాపాడుకోండంటూ అర్ధరాత్రి ఓ అమ్మాయి నుంచి ఆ తండ్రికి ఫోన్.. తెల్లారేసరికి..
బాధిత మహిళ ఢిల్లీలోని జోర్ బాగ్ స్టేషన్లో మెట్రో రైలు ఎక్కింది. మెట్రో రైలులో ఉన్న ప్రయాణికుడు ఆమె దగ్గరకు వచ్చి తన ఫైల్లో ఉన్న అడ్రస్ చెప్పమని అడిగాడు. ఆమె అడ్రస్ చెప్పింది. అనంతరం తన స్టేషన్ రాగానే దిగిపోయి ప్లాట్ఫామ్ మీద ఉన్న బెంచి మీద కూర్చుంది. అక్కడకు ఆ వ్యక్తి మళ్లీ వచ్చాడు. మరోసారి ఫైల్ ఇచ్చి అడ్రస్ క్షుణ్నంగా చెప్పాలని అడిగాడు. ఆ క్రమంలో తన పురుషాంగాన్ని ఆమె మొహానికి తాకించాడు. అలా మూడుసార్లు చేశాడు. అతనేం చేస్తున్నాడో కొద్దిసేపటి తర్వాత గమనించిన మహిళ అక్కణ్నుంచి పరిగెత్తి ప్లాట్ఫామ్ మీద ఉన్న పోలీస్ కానిస్టేబుల్కు ఫిర్యాదు చేసింది. అతను పట్టించుకోకుండా పై ఫ్లోర్లో ఉన్న స్టేషన్లో ఫిర్యాదు చేయమన్నాడు.
బాధిత మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని కూడా గుర్తించింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకునేందుకు నిరాకరించారు. దానిని పెద్ద సీన్ చేయవద్దని ఆమెకు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ మహిళ ఇంటికి వెళ్లిపోయి ట్విటర్ ద్వారా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్కు ఫిర్యాదు చేసింది. ఆమె ట్వీట్కు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు స్పందించారు. ఆ ఘటన ఏ సమయంలో జరిగిందో చెప్పాలని అడిగారు. ప్రస్తుతం ఆ కేసుపై విచారణ జరుపుతున్నారు.