మీ కొడుకును చంపబోతున్నారు.. కాపాడుకోండంటూ అర్ధరాత్రి ఓ అమ్మాయి నుంచి ఆ తండ్రికి ఫోన్‌.. తెల్లారేసరికి..

ABN , First Publish Date - 2022-06-02T22:35:20+05:30 IST

ఆ 17 ఏళ్ల యువకుడు కొందరు వ్యక్తులతో కలిసి మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లాడు..

మీ కొడుకును చంపబోతున్నారు.. కాపాడుకోండంటూ అర్ధరాత్రి ఓ అమ్మాయి నుంచి ఆ తండ్రికి ఫోన్‌.. తెల్లారేసరికి..

ఆ 17 ఏళ్ల యువకుడు కొందరు వ్యక్తులతో కలిసి మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లాడు.. అర్ధరాత్రి దాటుతున్నా ఇంటికి రాలేదు.. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు.. ఆ సమయంలో ఆ యువకుడి తండ్రికి ఓ యువతి నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. `మీ కొడుకును చంపబోతున్నారు.. ఎలాగైనా కాపాడండి` అని ఆ యువతి హెచ్చరించింది.. దీంతో కుటుంబ సభ్యుల ఆందోళన మరింత పెరిగింది.. తర్వాతి రోజు ఉదయం ఆ యువకుడి మృతదేహం ఘోరమైన స్థితిలో లభ్యమైంది. 


ఇది కూడా చదవండి..

పొరుగింట్లో నుంచి తీవ్ర దుర్వాసన.. కారణమేంటో తెలుసుకునేందుకు స్థానికులు వెళ్లి చూసే సరికి..


బీహార్‌లోని గోపాల్‌గంజ్‌కు చెందిన 17 ఏళ్ల విద్యార్థి అనూప్ కుమార్ మంగళవారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. కొందరు వ్యక్తులు అనూప్‌ను తీసుకెళ్లారు. అర్ధరాత్రి అయినా అనూప్ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకుల్లో ఆందోళన పెరిగింది. అనూప్ కోసం వెతుకులాట ప్రారంభించారు. ఇంతలో అనూప్ తండ్రికి ఓ అమ్మాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అనూప్‌ హత్యకు కొందరు పథకం వేశారని, అనూప్‌ను ఓ ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారని, దయచేసి అనూప్‌ని రక్షించండి అని ఆ యువతి చెప్పింది. దీంతో అనూప్ తల్లిదండ్రులు రాత్రంతా అతని కోసం వెతుకుతూనే ఉన్నారు. 


బుధవారం ఉదయం గ్రామ శివార్లలో అనూప్ మృతదేహం లభ్యమైంది. దుండగులు ముందుగా అనూప్‌ను కత్తితో పొడిచారు. ఆ తర్వాత యాసిడ్ పోశారు. అతడు బాధతో విలవిలలాడుతుండగా పైన పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కణ్నుంచి పరారయ్యారు. అనూప్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు షాకయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.   


Updated Date - 2022-06-02T22:35:20+05:30 IST