Chandrababu: వైసీపీ సైకోలను భూస్థాపితం చేసేంతవరకు నేనుంటా..!!

ABN , First Publish Date - 2022-12-02T19:47:16+05:30 IST

ఏపీలో సైకో పాలన కొనసాగుతోందని చంద్రబాబు విమర్శించారు.

Chandrababu: వైసీపీ సైకోలను భూస్థాపితం చేసేంతవరకు నేనుంటా..!!

నిడదవోలు: (తూర్పుగోదావరి జిల్లా) నిడదవోలులో 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' కార్యక్రమంలో చంద్రబాబు (Chandrababu) పాల్గొన్నారు. ఏపీలో సైకో పాలన కొనసాగుతోందని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ (YCP) సైకోలను భూస్థాపితం చేసేంతవరకు తానుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని బాగుచేసే వరకు తాను ఉంటానని చంద్రబాబు చెప్పారు. సకల శాఖామంత్రి సజ్జల కొండలన్నీ మింగేస్తున్నారని, ఒక సైకో చేతుల్లో రాష్ట్రం నాశనం అవుతోందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధి, భావితరాల బాగు కోసమే తన పోరాటమని, వచ్చే ఎన్నికలు.. తనకు చివరి ఎన్నికలు కాదని చంద్రబాబు అన్నారు.

Updated Date - 2022-12-02T19:47:53+05:30 IST