Ayyanna Patrudu: జగన్‌రెడ్డికి వారి పేరెత్తే అర్హత లేదు

ABN , First Publish Date - 2022-12-02T17:57:15+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు

Ayyanna Patrudu: జగన్‌రెడ్డికి వారి పేరెత్తే అర్హత లేదు

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) విమర్శలు గుప్పించారు. బీసీలకు కన్నతల్లి టీడీపీ అయితే సవతితల్లి వైసీపీ అని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. పదవులన్నీ సొంత సామాజికవర్గానికే సీఎం జగన్‌రెడ్డి కట్టబెట్టారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనకబడిన వర్గాలకు జగన్ మోసపు రెడ్డి వెన్నుపోటు పోడిచారని అయ్యన్న ఆరోపించారు. వెనకబడిన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీనే అని ఆయన స్పష్టం చేశారు. బీసీల పదవులు, నిధులు దోచేసి.. రిజర్వేషన్లకు కోత విధించిన జగన్‌, బీసీల ద్రోహి జగన్‌రెడ్డికి వారి పేరెత్తే అర్హత లేదని అయ్యన్న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2022-12-02T18:08:10+05:30 IST