Canada: ఉద్యోగం కోసం కెనడా వెళ్లిన భారతీయుడు.. తాజాగా జరిగిన దుర్ఘనటలో..

ABN , First Publish Date - 2022-12-28T14:47:41+05:30 IST

కెనడాలో ఘోరం జరిగిపోయింది. ఉద్యోగం నిమిత్తం ఇటీవలే కెనడాకు వెళ్లిన భారతీయుడు(Indian) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదంలో ఇండియాకు చెందిన వ్యక్తితో పాటు మరో ముగ్గరు..

Canada: ఉద్యోగం కోసం కెనడా వెళ్లిన భారతీయుడు.. తాజాగా జరిగిన దుర్ఘనటలో..

ఎన్నారై డెస్క్: కెనడాలో ఘోరం జరిగిపోయింది. ఉద్యోగం నిమిత్తం ఇటీవలే కెనడాకు వెళ్లిన భారతీయుడు(Indian) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదంలో ఇండియాకు చెందిన వ్యక్తితో పాటు మరో ముగ్గరు వ్యక్తులు కూడా మరణించగా.. సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

పంజాబ్‌(Punjab)లోని అమృత్‌సర్‌కు చెందిన కరణ్‌జోత్ సింగ్ సోధీ(41) కెనడా(Canada)లోని ఓ రెస్టారెంట్‌లో చీఫ్ చెఫ్‌గా ఉద్యోగం పొందాడు. ఈ క్రమంలోనే అతడు ఇండియా నుంచి కెనడాకు(Indian-Canada) కొద్ది రోజుల క్రితం వెళ్లాడు. అయితే.. అతడు ప్రయాణిస్తున్న సోమవారం రోజు ప్రమాదానికి గురైంది. రోడ్డుపై తీవ్రమైన మంచు పేరుకుపోయిన కారణంగా కరణ్‌జోత్ సింగ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదాని(Bus Accident)కి గురైంది. ఈ దుర్ఘటనలో కరణ్‌జోత్ సింగ్‌తోపాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 52 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారందరినీ స్థానిక పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-28T14:47:47+05:30 IST