భారత ఎంబసీ అధికారులతో తెలుగు ప్రవాసీ సంఘ ప్రతినిధుల సమావేశం

ABN , First Publish Date - 2022-11-28T07:29:39+05:30 IST

సౌదీ అరేబియాలోని ప్రవాసీ తెలుగు సంఘమైన సాటా ప్రతినిధి బృందం ఇటీవల రియాధ్‌లోని భారతీయ రాయబార అధికారవర్గాలతో..

భారత ఎంబసీ అధికారులతో తెలుగు ప్రవాసీ సంఘ ప్రతినిధుల సమావేశం

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలోని ప్రవాసీ తెలుగు సంఘమైన సాటా ప్రతినిధి బృందం ఇటీవల రియాధ్‌లోని భారతీయ రాయబార అధికారవర్గాలతో సమావేశమైంది. భారతీయ ఎంబసీలోని సీనియర్ దౌత్యవేత్త అయిన యన్.రాంప్రసాద్‌తో సాటా ప్రతినిధి బృందం సమావేశమై సంఘం చేపడుతున్న సాంస్కృతిక, సామాజిక సేవ కార్యక్రమాలను వివరించినట్లుగా సాటా ఒక ప్రకటనలో తెలిపింది.

దౌత్యవేత్తతో సమావేశమైన సాటా ప్రతినిధుల బృందంలో సంస్థ వ్యవస్ధాపక అధ్యక్షుడు మల్లేశన్, ఇద్దరు అధ్యక్షులు ఆనందరాజు, చాంద్ పర్వీన్ మరియు సలహాదారులు గీతా శ్రీనివాస్‌లు ఉన్నారు. సంస్థ కార్యకలాపాలను వివరించి దేశాభివృద్ధిలో కూడా తాము భాగస్వామ్యం అవుతామని తెలిపారు. దీంతో స్పందించిన ఎంబసీ అధికారులు.. సాటా ప్రతినిధి బృందాన్ని అభినందించినట్టు మల్లేశన్ వెల్లడించారు.

Updated Date - 2022-11-28T08:16:12+05:30 IST