Joe Biden : శ్వేత సౌధంలో నిరాడంబరంగా బైడెన్ మునిమనుమరాలి పెళ్లి

ABN , First Publish Date - 2022-11-20T14:42:51+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మునిమనుమరాలు నవోమీ బైడెన్ (Naomi Biden) వివాహం శ్వేత సౌధం

Joe Biden : శ్వేత సౌధంలో నిరాడంబరంగా బైడెన్ మునిమనుమరాలి పెళ్లి

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మునిమనుమరాలు నవోమీ బైడెన్ (Naomi Biden) వివాహం శ్వేత సౌధం (White House)లో శనివారం జరిగింది. 28 ఏళ్ళ నవోమీ, పాతికేళ్ళ పీటర్ నీల్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరు ఈ మైదానంలో పెళ్లి చేసుకున్న 19వ జంట. జో బైడెన్ అంతర్గత కూటమిలో నవోమీ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2020లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేవిధంగా ఆయనను ప్రోత్సహించినవారిలో ఆమె ముఖ్య వ్యక్తి.

హంటర్ బైడెన్, ఆయన తొలి భార్య కేథలీన్ బుహ్లేల పుత్రిక నవోమీ బైడెన్. జో బైడెన్ మొదటి కుమార్తె 1972లో కారు ప్రమాదంలో మరణించారు. ఆమె పేరునే నవోమీకి పెట్టారు. ఆ ప్రమాదంలో ఆయన మొదటి భార్య కూడా ప్రాణాలు కోల్పోయారు.

నవోమీ బైడెన్, పీటర్ నీల్ వివాహం వైట్‌హౌస్‌లోని సౌత్ లాన్‌లో శనివారం జరిగింది. దేశాధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ సహా దాదాపు 250 మంది అతిథులు హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. మీడియాను అనుమతించవద్దని వధూవరులు కోరినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరినే జీన్-పియర్రే చెప్పారు. ఇది ప్రైవేటు కుటుంబ కార్యక్రమమని తెలిపారు.

ఇదిలావుండగా, రిచర్డ్ నిక్సన్ కుమార్తె ట్రిసియా (1971) వివాహం, బరాక్ ఒబామా అధికారిక ఫొటోగ్రాఫర్ పీట్ సౌజా (2013) వివాహం కూడా ఈ మైదానంలోనే జరిగాయి.

Updated Date - 2022-11-20T14:42:56+05:30 IST