US Security Alert: పాకిస్థాన్‌లోని మారియట్ హోటల్‌కు వెళ్లవద్దు...అమెరికా సెక్యూరిటీ అలర్ట్

ABN , First Publish Date - 2022-12-26T07:40:03+05:30 IST

పాకిస్థాన్ దేశ సందర్శన విషయంలో అమెరికా సంచలన హెచ్చరిక జారీ చేసింది....

US Security Alert: పాకిస్థాన్‌లోని మారియట్ హోటల్‌కు వెళ్లవద్దు...అమెరికా సెక్యూరిటీ అలర్ట్
islamabad marriott hotel

వాషింగ్టన్ : పాకిస్థాన్ దేశ సందర్శన విషయంలో అమెరికా సంచలన హెచ్చరిక జారీ చేసింది.(US Security Alert) పాకిస్థాన్ దేశంలోని ఇస్లామాబాద్ నగరంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడి జరిగిన నేపథ్యంలో అమెరికా తాజాగా భద్రతా హెచ్చరిక జారీ చేసింది.(islamabad marriott hotel) ఇస్లామాబాద్‌లోని మారియట్ హోటల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అమెరికన్లపై దాడి చేసేందుకు కుట్ర పన్నుతున్నారని యూఎస్ ఎంబసీ తన భద్రతా హెచ్చరికలో పేర్కొంది.

ఇస్లామాబాద్‌లోని యునైటెడ్ స్టేట్స్ రాయబార కార్యాలయం ఫెడరల్ క్యాపిటల్‌లోని మారియట్ హోటల్‌ను సందర్శించకుండా తమ సిబ్బందిని నిషేధించింది.(staff not to visit)యూఎస్ ఎంబసీ తన ప్రభుత్వ సిబ్బందిని ప్రార్థనా స్థలాల వద్ద అప్రమత్తంగా ఉండాలని,పెద్ద సంఖ్యలో జనాలు ఉండే ప్రదేశాల్లోకి వెళ్లవద్దని కోరింది.ఇస్లామాబాద్‌లోని యూఎస్ ఎంబసీ తన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన హెచ్చరికలో తెలిపింది.పాకిస్థాన్ దేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాల నేపథ్యంలో ఇస్లామాబాద్ నగరంలో హై అలర్ట్ ప్రకటించింది.

Updated Date - 2022-12-26T07:40:05+05:30 IST