AP News: బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభం

ABN , First Publish Date - 2022-11-11T11:12:20+05:30 IST

జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కడీయద్ద వద్ద బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు.

AP News: బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభం

పశ్చిమగోదావరి: జిల్లాలోని తాడేపల్లిగూడెం మండలం కడీయద్ద వద్ద బాణాసంచా పేలుడు ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. బాణాసంచా తయారీకి అన్నవరం అనే వ్యక్తి లైసెన్స్ తీసుకున్నారు. 15 కిలోల వరకు మాత్రమే ముడిసరుకు నిల్వకు అనుమతి లభించింది. అయితే అనుమతికి మించి వందల కిలోల ముడి సరుకు నిల్వ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - 2022-11-11T11:12:22+05:30 IST