AP News: బలవంతంగా గుడిసెల తొలగింపు.. జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2022-10-28T09:11:03+05:30 IST

నగరంలోని ఆనందపురం మండలం పొడుగుపాలెంలో ఘోరం చోటు చేసుకుంది.

AP News: బలవంతంగా గుడిసెల తొలగింపు.. జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి

విశాఖపట్నం: నగరంలోని ఆనందపురం మండలం పొడుగుపాలెంలో ఘోరం చోటు చేసుకుంది. అంగన్వాడి భవన నిర్మాణం కోసం అధికారులు బలవంతంగా గుడిసెలను తొలగించారు. అయితే గుడిసెల తొలగింపును ఓ వృద్ధురాలు, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో జేసీబీ ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక వైసీపీ నాయకులు, అధికారులపై వృధ్దురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే జేసీబీ డ్రైవర్‌పైన పోలీసులు కేసు పెట్టడంపై కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన స్థానిక వైసీపీ సర్పంచ్, అధికారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2022-10-28T09:11:05+05:30 IST