Chandrababu: కందుకూరు సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు
ABN , First Publish Date - 2022-12-31T18:15:22+05:30 IST
కందుకూరు సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మాజీ సీఎంగా తాను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదని విమర్శించారు.
అమరావతి: కందుకూరు సభకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. మాజీ సీఎంగా తాను వచ్చినా పోలీసులు రక్షణ కల్పించలేదని విమర్శించారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు. ప్రమాదానికి ముందే పోలీసులను హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. కందుకూరు ఘటనపై ప్రధాని మోదీ (Prime Minister Modi) స్పందించాకే సీఎం జగన్ (CM Jagan) స్పందించారని పేర్కొన్నారు. 8 మంది టీడీపీ (TDP) కార్యకర్తలను కోల్పోయి తాము బాధలో ఉంటే.. వైసీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.