AP Minister: మంత్రి జయరాం భార్యకు ఐటీ నోటీసులు

ABN , First Publish Date - 2022-12-01T09:21:54+05:30 IST

మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. బినామీ యాక్టు కింద నోటీసులు జారీ అయ్యాయి.

AP Minister: మంత్రి జయరాం భార్యకు ఐటీ నోటీసులు

కర్నూలు: మంత్రి గుమ్మనూరు జయరాం భార్య (IT notices to AP Minister Gummanuru Jayaram Wife) రేణుకమ్మకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. బినామీ యాక్టు కింద నోటీసులు జారీ అయ్యాయి. కర్నూలు జిల్లా అస్పరిలో కొనుగోలు చేసిన 30.83 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలపై ఐటీ నోటీసులు పంపింది. రూ. 52.42 లక్షల విలువైన భూ కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని నోటీసులో పేర్కొన్నారు. మొత్తం 180 ఎకరాల భూమిలో రేణుకమ్మ పేరు మీద 30.83 ఎకరాలున్నట్టు వెల్లడించారు. మిగిలిన భూమి కూడా మంత్రి గుమ్మనూరు జయరాం బంధువుల పేరు మీదే రిజిస్టర్ అయినట్టు గుర్తించామన్నారు. ఒకే రోజున మంత్రి భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్టర్ చేసినట్టు ఐటీ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.

భార్య రేణుకమ్మ సహా 180 ఎకరాలు కొనుగోళ్లు చేసింది మంత్రి బినామీలేననే నోటీసులో స్పష్టీకరించారు. 180 ఎకరాలను సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. 90 రోజుల్లోగా భూ కొనుగోళ్ల లావాదేవీలకు సంబంధించిన ఇన్కంసోర్స్ అందివ్వాలన్న ఐటీ విభాగం స్పష్టం చేశారు. గతంలో ఇదే భూముల కొనుగోలు వివాదంలో మంత్రి చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇతినా ప్లాంటేషన్స్ సంస్థకు చెందిన భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని సంస్థ డైరెక్టర్ మనో బెంగుళూరులో కేసు పెట్టారు. రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని కోర్టులో దావా వేశారు. ఇతినా సంస్థ డైరెక్టర్ మనుపై మంత్రి భార్య, బంధువు ఆస్పరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Updated Date - 2022-12-01T09:21:55+05:30 IST