Kalva srinivasulu: చంద్రబాబుకు వస్తున్న ప్రజాదరణను వైసీపీ జీర్ణించుకోలేకపోతోంది
ABN , First Publish Date - 2022-11-05T11:47:46+05:30 IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు వస్తున్న ప్రజాధరణను వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu naidu)కు వస్తున్న ప్రజాధరణను వైసీపీ (YCP) జీర్ణించుకోలేకపోతోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు (Kalva srinivasulu) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... అందుకే సీఎం జగన్ (YS Jagan mohan reddy) ఆయన్ను దొంగ దెబ్బ తీయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నందిగామలో కరెంటు తీసేసి రాళ్లు వేయించడాన్ని బట్టి చూస్తే జగన్ (AP CM) ఎంతగా భయపడుతున్నాడో ఇట్టే అర్థమవుతుందని తెలిపారు. దీని ద్వారా తన పాలనలో శాంతి, భద్రతల వైఫల్యాన్ని జగనే చాటుకున్నట్లయిందన్నారు. భౌతిక దాడుల ద్వారా ప్రతిపక్ష నాయకుడిని భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యంలో ప్రమాదకర సంకేతమని తెలిపారు. పాలకులు ఇలాంటి 'పిచ్చి'పనులు మానుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కాలవ శ్రీనివాసులు (Former minister) హెచ్చరించారు.