Ramakrishna: కందుకూరు ఘటనను రాజకీయం చేయడం జగన్‌కు తగదు

ABN , First Publish Date - 2022-12-31T13:32:32+05:30 IST

‘‘దిగజారి మాట్లాడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి... మతిభ్రమించి మాట్లాడుతున్న మంత్రి ధర్మాన’’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శలు గుప్పించారు.

Ramakrishna: కందుకూరు ఘటనను రాజకీయం చేయడం జగన్‌కు తగదు

అమరావతి: ‘‘దిగజారి మాట్లాడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి... మతిభ్రమించి మాట్లాడుతున్న మంత్రి ధర్మాన’’ అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (CPI Leader Ramakrishna) విమర్శలు గుప్పించారు. కందుకూరులో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయటం జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)కి, ఆయన సలహాదారులకు తగదన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) వల్లే కందుకూరు మరణాలు జరిగి ఉంటే ఆయనపై హత్యానేరం కేసులు ఎందుకు మోపలేదని ప్రశ్నించారు. అసలు ఏపీకి రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు. విశాఖను చిన్న రాష్ట్రంగా చేయాలనడం మంత్రి ధర్మాన ప్రసాదరావు అవివేకానికి నిదర్శనమన్నారు. మంత్రి ధర్మాన మంత్రి పదవికి అనర్హుడని వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగమే ధర్మాన విపరీత వ్యాఖ్యలు అంటూ రామకృష్ణ విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-01-09T22:41:22+05:30 IST