CPI Ramakrishna: బీజేపీ కండువా కప్పుకుంటే కేసులే లేకుండా చేస్తున్నారు

ABN , First Publish Date - 2022-12-02T18:51:12+05:30 IST

కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థి పార్టీలపై దాడికి ప్రతి అంశాన్ని కేంద్రం వాడుకుంటోందని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు.

CPI Ramakrishna: బీజేపీ కండువా కప్పుకుంటే కేసులే లేకుండా చేస్తున్నారు

ప్రకాశం: కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థి పార్టీలపై దాడికి ప్రతి అంశాన్ని కేంద్రం వాడుకుంటోందని సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. కేంద్రానికి లొంగిపోయిన ప్రభుత్వాలతోనే సాఫ్ట్‌గా ఉంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్‌ కుమార్తెపై ఈడీ కేసు పెట్టారని, ఏపీలో నాలుగేళ్లైనా వివేకా హత్య కేసు తేల్చలేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కండువా కప్పుకుంటే కేసులే లేకుండా చేస్తున్నారని సీపీఐ రామకృష్ణ అన్నారు.

Updated Date - 2022-12-02T18:51:14+05:30 IST