AP News: సీఎం జేబు సంస్థలా ఆర్టీసీ మారింది: వర్ల

ABN , First Publish Date - 2022-12-20T20:12:22+05:30 IST

ముఖ్యమంత్రి (CM) జేబు సంస్థలా ఆర్టీసీ మారిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Vrala Ramaiah) అన్నారు.

AP News: సీఎం జేబు సంస్థలా ఆర్టీసీ మారింది: వర్ల

విజయవాడ: ముఖ్యమంత్రి (CM) జేబు సంస్థలా ఆర్టీసీ మారిందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య (Vrala Ramaiah) అన్నారు. జగన్‌రెడ్డి (Jagan) రథ చక్రాల కింద ఆర్టీసీ చక్రాలు నలుగుతున్నాయన్నారు. ఆర్టీసీ (RTC) భూములు దోచుకునేందుకే.. ప్రభుత్వ పరమనే నాటకమడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వద్దంటున్నా వినకుండా ప్రభుత్వ పరం చేసి ఆర్టీసీ యూనియన్లు బోల్తా పడ్డాయన్నారు. ఆర్టీసీలోని ఖాళీ స్థలాలు భవిష్యత్లో వైసీపీ పరమవుతాయన్నారు. బాపట్లలో 2 ఎకరాల భూమిని వైసీపీ (YCP)కి అంకితం చేసుకున్నారని ఆరోపించారు. కార్పొరేషన్గా కొనసాగితే ఆర్టీసీ స్థలాలు కొట్టేసే అవకాశం ప్రభుత్వానికి ఉండేది కాదని ఆయన పేర్కొన్నారు. సీఎం జోక్యం చేసుకొని ఆర్టీసీ స్థలాల కబ్జాను ఆపాలని సూచించారు.

Updated Date - 2022-12-20T20:12:23+05:30 IST